హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ టోర్నమెంట్లో నల్లగొండ ఈగల్స్ జట్టు విజయం సాధించింది. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో నల్లగొండ ఈగల్స్ 43–36తో గద్వాల్ గ్లాడియేటర్స్ను ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ధాటిగా ఆడిన నల్లగొండ ఈగల్స్ జట్టు తొలి అర్ధభాగం ముగిసేసరికి 23–16తో ముందంజ వేసింది. అయితే రెండో అర్ధభాగంలో ఈగల్స్ జట్టుకు దీటుగా గద్వాల్ గ్లాడియేటర్స్ జట్టు పోరాడింది. దీంతో రెండో అర్ధభాగంలో ఇరు జట్లూ చెరో 20 పాయింట్లు సాధించాయి. అయితే తొలి అర్ధభాగంలో సాధించిన ఆధిక్యం కారణంగా నల్లగొండ జట్టు విజేతగా నిలిచింది. 19 పాయింట్లతో ఈగల్స్ జట్టుకు విజయాన్నందించిన పి. మల్లికార్జున్కు ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కగా... డిఫెండింగ్లో రాణి ంచిన రామ్ ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు.
నల్లగొండ ఈగల్స్ విజయం